ATP: గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన రంగనాథ స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆలయ హుండీ లెక్కింపు ఉంటుందని ఈవో రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులు వేసిన కానుకలకు దేవదయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ నిర్వహకులు, అర్చకులు హాజరు కావాలన్నారు.