కడప: రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలసపాడుకు చెందిన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బ్రహ్మానందరెడ్డి కోరారు. విజయవాడలో బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలిసి వినతిపత్రం ఇచ్చామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.