కడప: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు రూ. 9,417 కోట్లు కేటాయించడం జరిగిందని ఆ శాఖ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం పట్ల జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత డా దాసరి రవిశంకర్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. విశాఖ, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్ల అభివృద్ధి, మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.