KKD: మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కాకినాడ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మురళీకృష్ణ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆటో డ్రైవర్లు ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.