కృష్ణా: జాతీయ రహదారిపై భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. మంగళవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ టోల్ గేట్ సమీపంలో విజిలెన్స్ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న రెండు లారీలను గుర్తించి అడ్డుకున్నారు. ఒక లారీలో 250 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరొక లారీలో సీఎంఆర్ బియ్యం ఉన్నాయని వాహనదారుడు రికార్డ్ చూపగా, వాటిని తనిఖీకు పంపించారు.