మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథ సప్తమి సందర్భంగా స్వామి నగరోత్సవంలో అమలు చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్ల గురించి డీఎస్పీ నాగరాజుతో చర్చించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని ఎస్పీ ఆదేశించారు.