ప్రకాశం: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్స్ను ఒంగోలులోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 10న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడీలు, పాఠశాలలకు, కళాశాలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కడుపులో నులి పురుగుల నివారణతో వ్యాధులు దూరమవుతాయన్నారు.