KRNL: జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గడ్డి వాములు దగ్ధమయ్యాయి. స్థానికులు కడవల సహాయంతో మంటలను ఆర్పి, పక్కనే ఉన్న గడ్డి వాములకు మంటలు వ్యాప్తి చెందకుండా కాపాడారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రైతులు శ్రీనివాసులు, భీమరాయుడు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో గడ్డి ఖాళీ బూడిదగా మారిందన్నారు.