VZM: గంజాయి, మాదక ద్రవ్యాల వంటివాటి బారిన పడకుండా యువత జాగ్రత్తలు పాటించాలని రూరల్ ఎస్ఐ వి. అశోక్ కుమార్ పిలుపు నిచ్చారు. స్థానిక జగనన్న హౌసింగ్ కాలనీవాసులతో ఆయన ఆదివారం మమేకమైయారు. రాత్రి వేళల్లో ఇళ్లకు వచ్చేటప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.ఐ గస్తీ ఏర్పటు చేస్తామని భరోసా ఇచ్చారు.