ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు చెప్పారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న సాధారణ సమావేశంలో 29 అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కేటాయించిన నిధులతో చేపట్టిన పనుల ఆమోదం, ముస్లిం షాదీఖానా స్థలం అంశాలపై చర్చ ఉంటుందన్నారు.