KMR: సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగ చేయాలని ప్రముఖ యోగ గురువు పరమార్థ దేవ్ అన్నారు. కామారెడ్డిలో యోగా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారని తెలిపారు.