NZB: భీమగల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో శుక్రవారం ద్విచక్ర వాహనాల వేలం నిర్వహించనున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేణు మాధవరావు తెలిపారు. జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు భీమ్గల్ పరిధిలో ఒక కేసులో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలు వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద జరిగే వేలంలో పాల్గొనాలన్నారు.