SRCL: ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లిలో గురువారం రాత్రి ‘మీకోసం పోలీస్’ కార్యక్రమాన్ని ఎస్సై గణేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పైక్టర్ మొగిలి హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. మూఢనమ్మకాలపై ప్రతి ఒక్కరు అవగాహనతో ఉండాలన్నారు.