SRCL: కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయిందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశం మరువలేనివన్నారు.