నల్గొండ: కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 28న నల్గొండలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు తెలిపారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ర్యాలీ నిర్వహిస్తామన్నారు.