MDK: ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏడుపాయల చెక్ డ్యామ్ వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. కుచన్ పల్లికి చెందిన వెంకటి(43) గురువారం విందు నిమిత్తం ఏడుపాయలకు కుటుంబీకులతో కలిసి వచ్చారు. చెక్ డ్యామ్లో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం లభ్యమైంది.