MLG: సీఆర్టీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గోవింద్ నాయక్ అన్నారు. ఏటూరునాగారంలో సీఆర్టీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. ఐటీడీఏ విద్యాలయాల్లో 20 ఏళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్న సీఆర్టీలను క్రమబద్ధీకరించాలన్నారు.