GDWL: అలంపురం జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకునేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జి ఎస్.వి.ఎన్ భట్టి వస్తున్నట్టు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. ఆయన రాక కోసం దేవస్థానం తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 12 గంటల తర్వాత ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు.