MNCL: యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సుదమల్ల ఆశిష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖకు, తనకు ఓటు వేసిన యువతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆశిష 4062 ఓట్లు సాధించింది.