కోనసీమ: అమలాపురం మండలం నల్లమిల్లి ఎస్సీ స్మశాన వాటిక వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు చేతికందే ఎత్తులో ఉండి కిందకు వేలాడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని అక్కడ పని చేసే ఉపాధి శ్రామికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవసలని కోరుతున్నారు.