TPT: పాకాల, ఐరాల మండలాల్లో సోమవారం రాత్రి గాలి, వానకు మామిడి కాయలు నేలరాలాయి. కొన్ని ప్రాంతాల్లో గాలి వానకు వడగండ్లు తోడవడంతో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మరో వారం, పది రోజుల్లో కోతకు వచ్చే పంట నేలపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సుమారు 100 టన్నుల కాయలు రాలి ఉంటాయని అంచనా. ఈ మేరకు రాలిన కాయలను KG రూ.2-3 మద్య కొనుగోలు చేస్తున్నారు.