PDPL:పేదలకు సొంతిల్లు ఆత్మగౌరవానికి నిదర్శనమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట, కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లిలో మంగళవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్య క్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ మేరకు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.