KMM: ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం నగరంలోని స్థంభాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల భాస్కర్ రావును రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే అక్కడే చికిత్స పొందుతున్న హరి ప్రసాద్ను కూడా పరామర్శించారు.