హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. 2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది.
సమావేశంలో పరస్పరం కార్యకర్తలు దాడి చేసుకున్నారు. ఒకరిపై నొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చొక్కాలు చించుకున్నారు. మరింత శ్రుతిమించి చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరింది.
గత మార్చి నెలలో కూడా జీవన్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన సమయంలో సంఘటన చోటుచేసుకుంది. రెండు నెలల తర్వాత మరోసారి ఎమ్మెల్యే ప్రమాదానికి గురయ్యారు.
బ్రాహ్మణ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదనం ప్రారంభించుకున్న శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా.
బీజేపీ చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దానిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సొంతపార్టీలో మండిపడుతున్న వారు కొందరు అయితే... ఇప్పుడు నేరుగా ట్విట్టర్ లోనే విమర్శలు మొదలయ్యాయి.
రాష్ట్రంలో వేసవి సెలవులు మే 31తో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ కళాశాలల తరగతులు ఈ విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించి జూన్ 1న తిరిగి ప్రారంభం కానున్నాయి. మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు క్లాస్వర్క్ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుందని ఈ మేరకు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.
ఎంఐఎంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ముకాసే అలవాటు ఎంఐఎం(MIM)కు ఉంది. బండి సంజయ్ మాట్లాడుతూ.. ముస్లింల(Muslims) జీవితాలను నాశనం చేస్తున్న పార్టీ ఎంఐఎం.. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్నారు.
పలువురు దుండగులు అక్షయ్కుమార్ నటించిన 'స్పెషల్ 26' సినిమాతో పాటు పలు చిత్రాలు(movies) చూసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో 8 నుంచి 10 మంది కలిసి సికింద్రాబాద్లోని ఓ నగల దుకాణంలోకి ఐటీ అధికారులమని వెళ్లారు. 60 లక్షల రూపాయల విలువైన 17 బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్న సమయంలో, కేసీఆర్(CM KCR) ఈ సరికొత్త రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు(TDP chief leader Chandrababu Naidu) పేరిట ఉన్నది.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు(K Chandrasekhar Rao) తమ పార్టీ భారత రాష్ట్ర సమితి(BRS)ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల(assembly elections)ను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ఇక్కడ మార్గాలను అన్వేషిస్తోంది.
స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. నార్కట్పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పుష్ప-2 ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫ...
31 మే 2023న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం(anti tobacco day). ఈ సంవత్సరం 2023 థీమ్(theme) “మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు”. దీంతోపాటు పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యం. పొగాకు వ్యతిరేక దినోత్సవం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలకు పొగాకు వినాశకరమైన ప్రభావం గురించి గుర్తుచేయనున్నారు.