KMM: తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చిర్రా నర్సమ్మ ఘన విజయం సాధించారు. ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగిన ఆమె, సమీప ప్రత్యర్థిపై 462 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని లంబాడీ హేటి సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లావుడే బలునాయక్ విజయం సాధించారు. ప్రజల విశ్వాసం, మద్దతుతో గెలుపొందిన బలునాయక్ కు గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.
NRPT: నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థి మురారి కాంగ్రెస్ అభ్యర్థి రాముపై 444 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మురారికి 1,288 ఓట్లు రాగా, రాముకు 844 ఓట్లు వచ్చాయి.
KMM: కూసుమంచి మండల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా కృష్ణవేణి విజయం సాధించారు. అత్యధిక ఓట్లతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమెకు మద్దతుగా గ్రామస్థులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ఎన్నికతో కూసుమంచి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. ఆమె మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
RR: జిల్లాలో రెండో విడత ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవుని పడకల్ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి కానుగుల అనిత విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 300 ఓట్ల, 8/8 వార్డ్ మెంబర్ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
PDPL: జూలపల్లి మండలం బలరాజ్ పల్లె గ్రామ సర్పంచ్గా కుంటురి అంజమ్మ ప్రత్యర్థిపై ఎన్నికల్లో విజయం సాధించారు. గ్రామంలో పలు వార్డులలో స్వల్ప మెజార్టీతో సభ్యులు ఓటమి చెందారు. కుంటురి అంజమ్మ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. జూలపల్లి మండలంలో ఇంకా పలు గ్రామాల్లో ఫలితాలు తెలియాల్సి ఉంది.
KNR: చిగురు మామిడి మండలం ఓగులాపూర్ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గడ్డం రమాదేవి గెలుపొందారు. సీతారాంపూర్ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గోగురి లక్ష్మి (532), ఉల్లంపల్లి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అల్వాల శంకర్, ఇందుర్తి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చింతపుల నరేందర్ విజయం సాధించారు
NGKL: ఉప్పునుంతల మండలం రాయచూరులో బీజేపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి మొగిలి తిరుపతమ్మ తరఫున ఆదివారం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి తిరుపతమ్మను ఆదరించి, ఓట్లు వేసి గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందు, బాలకృష్ణ, రాము, మొగిలి అంజు పాల్గొన్నారు.
NZB: బోధన్ పట్టణం ఆచంపల్లిలో గల ఇందూర్ మోడల్ స్కూల్ వద్ద కాలనీలో ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఎలాంటి ప్రాణాష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
GDWL: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శాంతియుత వాతావరణంలో సజావుగా పూర్తయినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆదివారం మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
SDPT: భూంపల్లి మండలం బొప్పాపూర్ సర్పంచిగా మాధవనేని భాను ప్రసాద్ విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన భాను ప్రసాద్ సమీప ప్రత్యర్థి పై 282 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్య వాదాలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
WGL: సంగెం మండలంలోని ఎలుగూరు రంగంపేట గ్రామంలో బీజేపీ ఖాతా తెరిచింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బెజ్జంకి శేషాద్రి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 140 ఓట్ల మెజారిటీతో ఆదివారం ఘన విజయం సాధించారు. ఈ విజయంతో గ్రామంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పార్టీ జెండాలతో సంబరాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.