వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,455 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.17,000 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.19,000 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,500, కొత్త తెజా మిర్చి రూ.15,050 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.