SRCL: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టువద్ద బుధవారం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేలు పూజలు నిర్వహించారు. ఎగువ మానేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో మత్తడి దూకుతోంది. ఎగువ మానేరు ప్రాజెక్టులోకి కూడెల్లివాగు, పాల్వంచ వాగుల నుంచి వరదనీరు రావడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.