NLG: మెలుకువలను నేర్చుకుంటే అందరూ బొమ్మలను సులువుగా గీయవచ్చని ప్రభుత్వ పాఠ్య పుస్తక కార్టూనిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత వడ్డేపల్లి వెంకటేశ్ అన్నారు. సృజనాత్మకతోనే కళాత్మక బొమ్మలు సాధ్యమని తెలిపారు. కేతేపల్లి మండలం భీమవరం జెడ్పీహెచెస్లో విద్యార్థులకు బొమ్మలు ఎలా వేయాలో గురువారం ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు. వెంకటేష్ను టీచర్లు సన్మానించారు.