ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా రేపు జరగబోయే భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు సూపర్-4లో మరోసారి తలపడనున్నాయి. అయితే పాక్ జట్టుకు దుబాయ్ స్టేడియంలో ఆడిన అనుభవం చాలా ఎక్కువ ఉండటంతో ఈ మ్యాచ్ కీలకం కానుంది. వరల్డ్ కప్ చరిత్రలో పాక్ చేతిలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. అది కూడా దుబాయ్ స్టేడియంలోనే కావడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.