ప్రియాంకా అరుల్ మోహన్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. ఓంద్ కథే హెల్లా (2019) అనే కన్నడ చిత్రంతో తన నటనను ప్రారంభించింది. తెలుగు చిత్రం గ్యాంగ్ లీడర్ (2019) మరియు తమిళ చిత్రాలైన డాక్టర్ (2021), డాన్ (2022), ఎతర్క్కుం తునింధవన్ (2022) లలో ప్రధాన మహిళగా నటించింది. ప్రస్తుతం ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటిస్తుంది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.