SRCL : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ వ్యక్తి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించామని ఎస్సై రమాకాంత్ తెలిపారు. రాచర్ల బొప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీ చేయగా 80 గ్రాముల గంజాయి లభించిందన్నారు.
AP: నగ్నవీడియోలతో బెదిరించి రెండేళ్లుగా అత్యారం చేస్తూ, హింసలకు గురి చేస్తున్నాడంటూ ఓ వివాహిత నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గుంటూరు నల్లపాడు రోడ్డులో తినుబండారాల వ్యాపారం చేస్తున్న మహిళ ఫోన్ నెంబర్ తీసుకున్న వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు పరిచయం పెంచుకున్నాడు. తరువాత తనపై అత్యాచారం చేసి చిత్రీకరించాడు. వాటిని అడ్డుపెట్టుకొని తరచూ అత్యాచారం చేస్తున్నాడని, తనకు న్యాయం చేయా...
AP: ఎస్సై అని చెప్పి ఓ వివాహితను మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న మహిళ మనస్పర్థల కారణంతో తన భర్తతో విడిపోయింది. అనంతరం కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. ఈ క్రమంలో సాయితేజ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఎస్సైనని నమ్మించి 2023లో పెళ్లి చేసుకున్నాడు. తరువాత విడతలవారిగా తన నుంచి రూ. 23 లక్షలు, 8 సవర్ల బంగారం తీసుకొని పరార్ అయినట్లు ఫిర్యా...
ప్రకాశం: వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వేటపాలెంకు చెందిన కళ్యాణ్ రామ్, కంచర్ల వెంకట మనోజ్లు బైక్పై సముద్రతీరం నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుపై ఉన్న సిమెంట్ గ్రావెల్ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కళ్యాణ్ రామ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మనోజ్కు తీవ్ర గాయాలయ్యాయి.
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెళ్ళైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఏసీసీ కృష్ణ కాలనీకి చెందిన అయిండ్ల రోషిణి కడుపు నొప్పి భరించలేక సోమవారం రాత్రి తల్లిగారింటి వద్ద మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి గత ఆగస్టులో వివాహం జరిగింది. కేసు నమోదు చేసినట్లు SI రాములు తెలిపారు.
HYD: చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. లారీ అదుపుతప్పి దూసుకెళ్లడంతో కూరగాయలు అమ్మే వాళ్ళు చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినా వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
TG: సంగారెడ్డి జిల్లా డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడింది. ఈ సంఘటన కోహిర్ మండలం వెంకటాపూర్ కూడలి వద్ద చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడటంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ...
AP: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలి వద్ద నుంచి రూ. 40 లక్షలు కాజేశారు. తన పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సుజాతకుమారికి ఫోన్కాల్ చేసి ఆమె దగ్గరి నుంచి రూ. 40 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. జమ్ముకశ్మీర్, పుణెకు చెందిన ఐదురుగు నిందితులు అరెస్ట్ చేశారు.
TG: హైదరాబాద్లోని మేడ్చల్లో దారుణం జరిగింది. నెమ్మదిగా మాట్లాడమన్నందుకు వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన నేరేడ్మెట్ వినాయకనగర్ చౌరస్తా చోటుచేసుకుంది. రాముల అనే వ్యక్తి పాన్ కొట్టుండగా మరో వ్యక్తి గట్టిగా అరుస్తుండటంతో నెమ్మదిగా మాట్లాడాలని సూచించాడు. దాంతో ఇద్దరి మధ్య మటామాట పెరిగి రాములను దుండగుడు రాయితో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు నిందితుడి ...
ప్రకాశం: పొదిలి మండలం మల్లవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద రోడ్డును దాటుతున్న వృద్ధురాలను కారు సోమవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 సాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోక్సో చట్టం కింద కేేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్...
మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. నిందితుడు చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితుడిని ఎలాగైనా సరే పట్టుకుని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో తనుష్ నాయక్ (16) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనుష్.. ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ATP: బ్రహ్మసముద్రం మండలం తిప్పయ్య దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల బేబీ(26) ఆదివారం సాయంత్రం తన ఇంటి ముందర ఉన్న జొన్న పొట్టును పొయ్యి వెస్తేందుకు వెళ్లింది. జొన్న పొట్టు తీస్తుండగా ఆమె ఎడమ కాలుకు పాము కాటు వేసింది. ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. దీనిపై బ్రహ్మసముద్రం ఎస్సై నరేంద్ర కుమార్ కేసు నమోదు చేసి వివరాలు తెలిపారు.
ATP: గార్లదిన్నె మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక నాగరాజు అనే వ్యక్తి సోమవారం తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.