AP: ఈనెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే, బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో 5 రోజుల పని దినాల కోసం ఈనెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు.