అన్నమయ్య: పాల వ్యాన్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన చక్రినాయక్ బుధవారం రాయచోటి పెద్దబిడికిలో జరిగిన తన అన్నపెళ్లికి వెళ్ళాడు. సాయంత్రం బైక్పై ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు టోల్ ప్లాజా వద్ద పాలవ్యాను బైకును ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన...
KDP: నెల్లూరు జిల్లా సీతారాంపురం నుంచి కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి రోడ్డు రోలర్ను తీసుకువస్తున్న లారీ టేకూరుపేట సమీపంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు రోలర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఓ బాలికపై అత్యాచార కేసులో జైలుకెళ్లిన నిందితుడు బెయిల్పై బయటకు వచ్చి.. బాధితురాలిని హత్య చేసిన వైనం ఒడిశాలో జరిగింది. కును కిశాన్ అనే వక్తి సుందర్గఢ్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చిన అతను ఆ బాలికను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను వేర్వేరు చోట్ల విసిరేశాడు. బాలిక అదృశ్యంపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం...
కాళీ మాత ప్రత్యక్షం కాలేదని పూజారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చోటు చేసుకుంది. 24 గంటలుగా పూజల్లో నిమగ్నమైన పూజారి దేవత ప్రత్యక్షం కాలేదన్న మనస్తాపంతో పూజారి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అఫ్గానిస్థాన్లోని కాబూల్లో భారీ పేలుడు సంభవించింది. మంత్రి కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాలిబన్ మంత్రి ఖలీల్ ఉల్ రెహమాన్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఉల్ రెహమాన్ శరణార్థి శాఖను నిర్వహిస్తున్నారు.
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కారులో విష్ణు అనే వ్యక్తి ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఈ ఘటనలో కారులోంచి ప్రేమ్ చంద్ అనే మరో వ్యక్తి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు.
SRCL: మద్యం సేవించి పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుధవారం తీర్పు ఇచ్చినట్టు DSP చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 2017 ఫిబ్రవరి 2న సిరిసిల్లలో గగులోతు హనుమంతు డ్రంక్ & డ్రైవ్ చేపడుతున్న కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని దుర్భాషలాదడినందుకు అతనిపై కేసు నమోదు చేశామన్నారు.
HYD: నాంపల్లిలో భయానక వాతావరణం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం క్రిమినల్ కోర్టుకు వెళ్లే దారిలో ఉన్న HP పెట్రోల్ బంకుకు పెట్రోల్తో వ్యాన్ వచ్చింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వ్యాన్ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని రోడ్డు మీదకు మళ్లించాడు . స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
HYD: నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్ఆర్ నగర్లోని ఓ బాయ్స్ హాస్టల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆదర్శ్, శ్రీకాంత్, అజయ్, సంజయ్ ఉంటున్నారు. మొదట డ్రగ్స్కి బానిసలై ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వారి నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. గంగలూరు పరిధిలోని మూంగా ప్రాంతంలో ఐఈడీ పేలడంతో ఇద్దరు డీఆర్జీ సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
NRPT: మరికల్ మండలంలోని తీలేరు స్టేజీ దగ్గర గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నారాయణపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే మరికల్ ఎస్సై రాముకు వివరాలు తెలపాలని కోరారు. మరింత సమాచారం కోసం మరికల్ పోలీస్ స్టేషన్ నంబర్ 8712670408లో సంప్రదించాలని కోరారు.
MDK: ఆందోల్ మండలం అన్నాసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు డాకూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: నూజివీడులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం ఆగిరిపల్లి వైపు నుంచి దోస్త్ ట్రక్ వాహనంపై తీసుకువెళుతున్న ప్లాస్టిక్ వాటర్ డ్రమ్ గాలికి ఎగిరి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిపై పడింది. దీంతో వాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన రాయిపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది.
NRML: వాహన ప్రమాదంలో నీలుగాయి మృతి చెందిన ఘటన బుధవారం దిలావర్పూర్ మండలంలో జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీనా వివరాల మేరకు కుంటాల మండలం కల్లూరు నుండి నిర్మల్కు ప్రయాణిస్తున్న ఓ కారు లోలం-సిర్గాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న నీలుగాయిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ వైద్యుడికి సమాచారం అందించామన్నారు.