W.G: పాలకోడేరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ సచివాలయ సిబ్బందికి పేదరిక నిర్మూలనపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన P-4 కార్యక్రమం (పబ్లిక్, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం)లో భాగంగా పేదరికాన్ని నిర్మూలించడం ఎలా అనే అంశంపై ఈ శిక్షణ జరిగింది. ఎంపీడీఓ వీ.రెడ్డియ్య ఆధ్వర్యంలో అనేక కీలక అంశాలపై అవగాహన కల్పించారు.