తూ.గో: రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన పీ.జీ.ఆర్.ఎస్–మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 19 అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించి పూర్తి స్థాయి న్యాయం చేయాలని డివిజన్ స్థాయి అధికారులకు ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ సూచించారు. ప్రతి అర్జీని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.