CTR: దివ్యాంగులపై వివక్షత తగదని వైసీపీ ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు మణి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అందజేయడంలో కూటమి ప్రభుత్వం వివక్షత చూపుతున్నట్టు ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ మద్దతుదారులకే పింఛన్లు మంజూరు చేస్తున్నారని, ఇతర దివ్యాంగుల పింఛన్లు రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు.