CTR: చిత్తూరు నగర పరిధిలోని పూనేపల్లిలో ఆదివారం నూతన చర్చి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.