ATP: పామిడిలోని శ్రీ భావసార క్షత్రియ కళ్యాణ మండపంలో ఈనెల 21న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ తిరుపతి నాయుడు ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.