CTR: వినాయక చవితి నేపథ్యంలో పలమనేరు పోలీసులు ఐదు మందిని బైండోవర్ చేసినట్లు సీఐ నరసింహారాజు తెలిపారు. గతేడాది చవితి సందర్భంగా గొడవలు పడ్డ పలువురిని డీఎస్పీ ప్రభాకర్ ఎదుట హాజరుపరిచి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం వీరిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. కాగా, చవితి సందర్భంగా ఎవరైనా గొడవలు పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.