KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ చైత్ర వర్షిని ఆదివారం తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. మండలం, నియోజకవర్గస్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.