E.G: పెరవలి మండలం అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనుమ పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం అశ్వ వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పూజ కార్యక్రమాలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు పలువురు భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.