అనంతపురం: జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న ఓబులమ్మను కడప జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీ చేశారు. రామచంద్రారెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా DWMAలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.