MNCL: ఏప్రిల్ 6న ఉమ్మడి ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సమావేశంలో మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.