PPM: వీరఘట్టం పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ పి.రవి కుటుంబానికి తోటి సిబ్బంది అండగా నిలిచారు. సిబ్బంది ప్రోగు చేసిన రూ.1,64,000 ఆర్థిక సాయాన్ని ఎస్పీ మాధవరెడ్డి సోమవారం రవి సతీమణి లలితకు అందజేశారు. కష్టకాలంలో శాఖ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.