ATP: గుత్తి ఆర్ఎస్లో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ లోనే రైల్వే కోటర్స్లో జ్యోతి అనే మహిళ శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.