KDP: రెండవ కార్తీక సోమవారం సందర్భంగా చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటీ రుద్రాభిషేకాలు, సామూహిక అభిషేకాలు, ఆకాశ దీపారాధన, సహస్ర దీపాలంకరణ, వాహన సేవ, పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారికి పంచ హారతులు చేపట్టారు. గర్భాలయంలో కైలాసం, హిమాలయ పర్వతాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు.