BPT: జిల్లా కలెక్టర్ వెంకట మురళి బుధవారం క్యాంపు కార్యాలయంలో మాత శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆగస్టులో జిల్లాలో చోటుచేసుకున్న రెండు ప్రసవ మరణాల నేపథ్యంలో మాత శిశు మరణాల నివారణ కమిటీతో కలిసి ఈ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గర్భిణి ఆరోగ్యాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి, పూర్తి పర్యవేక్షణ కల్పించాలన్నారు.