KMM: నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న బూర్గుల కవితకు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మొహ్మద్ జాకీరుల్లా మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ అధ్యాపకులకు డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు.