KRNL: కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, జేసి నవ్య బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. ప్రభుత్వ పథకాల అమలులో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.