AP: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. అన్యమతానికి చెందిన వ్యాఖ్యలతో కూడిన ఓ కారు తిరుమలలో ప్రత్యక్షం కావటం వివాదాస్పదంగా మారింది. అన్యమత వ్యాఖ్యలతో కూడిన వాహనాన్ని కొండ మీదకు ఎలా పంపించారంటూ పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.